9, ఫిబ్రవరి 2009, సోమవారం

సమస్యాపూరణము

పరవశమునాట లాడెడి
పరమాత్మల చంకనెత్తి పడకకు జనగా
పరతన బేధము లెరగక
పరమ శివుని తోడ లక్ష్మి పవళించెనయా!

పరమ సాధ్వి అనసూయ త్రిమూర్తులను పిల్లలుగా చేసినప్పుడు
వారిని తిరిగి తీసుకుని వెళ్ళడానికి వచ్చిన వారి పత్నులు పడిన హడావిడి
లో చేతికందిన పిల్లగాడిని వెంట తీసుకెళ్ళారు అని చెప్ప దలిచాను.
నాల్గవ పాదం.. కందానికి సరిపోక కాస్త మార్చాను .

చింతా రామకృష్ణారావుగారు ఇచ్చిన సమస్యకు నా పూరణ.

http://andhraamrutham.blogspot.com/2009/02/1.html


======================================================


"పైకము, పదవులు చాలక
శోకించెడి రైతుల వ్యధ చూడక రాజుల్
మైకున అరచిరి ఓటిడ -
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!" అనండి.


డా.ఆచార్య ఫణీంద్ర గారు ఇచ్చిన సమస్యకు పూరణ - ఫణీంద్ర గారికి ధన్యవాదాలు. తప్పులను దిద్దినందుకు
http://dracharyaphaneendra.blogspot.com/2009/02/blog-post_06.html

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి